మోదీ గ్యారంటీలే బంగారు గుడ్లు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మోదీ గ్యారంటీలే బంగారు గుడ్లు : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రానికి కేంద్రం ఏం ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించటం కరెక్ట్ కాదని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మోదీ గ్యారంటీలే బంగారు గుడ్లు అని పేర్కొన్నారు. శుక్రవారం నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచా రంలో భాగంగా ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష కరెక్ట్ కాద న్నారు.

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి అవినీతి పరుడు, చీటర్ అని నిరూపిం చేందుకు తాను ఎక్కడికైనా వస్తానని సవాల్ చేశారు. అంబేద్కర్ చూపిన మార్గంలో తమ పార్టీ రిజర్వేషన్లను కొనసాగిస్తుందన్నారు.