బీఎస్పీకి అన్ని వర్గాల ప్రజలు చేరువవుతున్నారు

బీఎస్పీకి అన్ని వర్గాల ప్రజలు చేరువవుతున్నారు

అన్ని కులాలు, వర్గాలకు తమ పార్టీ చేరువవుతుండటంతో బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్‌లు  సందిగ్థంలో పడుతున్నాయని అన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి.  బీజేపీ పక్షపాత వైఖరితో విసిగిన దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు అగ్రవర్ణాల ప్రజలు ముఖ్యంగా బ్రాహ్మణులు బీఎస్పీకి దగ్గరువుతున్నారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు బీఎస్పీకి చేరువవుతుండటంతో తమ రాజకీయ ప్రత్యర్ధులు ఎస్పీ, కాంగ్రెస్‌, బీజేపీలు ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డాయన్నారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ బీఎస్పీ వ్యతిరేక శక్తులు కుట్ర రాజకీయాలు మరింత బహిర్గతమవుతాయని  మాయావతి తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని మాయావతి ఇప్పటికే ప్రకటించారు. భవిష్యత్‌లో ఎలాంటి ఎన్నికలైనా బీఎస్పీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఇటీవల ఆమె తేల్చిచెప్పారు. 2022 ఆరంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.