ప్రధానికి రక్షణ కల్పించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలం

ప్రధానికి రక్షణ కల్పించడంలో పంజాబ్ ప్రభుత్వం విఫలం

ప్రధాని మోడీకి రక్షణ కల్పించడంలో పంజాబ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిరసన పేరుతో మోడీని అడ్డుకోవడం దారుణమన్నారు. హైదరాబాద్ అల్కాపురిలోని శృంగేరి మఠం ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు రాష్ట్ర బీజేపీ నేతలు. ప్రధాని మోడీ ఆయురోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు.  హోమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, లక్ష్మణ్, డీకే అరుణ, బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు, బీజేపీ మహిళామోర్చా అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.