జాబ్స్​ ఇవ్వని బీజేపీని ఎందుకు గెలిపించాలి

జాబ్స్​ ఇవ్వని బీజేపీని ఎందుకు గెలిపించాలి
  •      ఎన్నికల రణంలో గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తం
  •     కుల్కచర్ల కార్నర్ ​మీటింగులో చేవెళ్ల కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రంజిత్​రెడ్డి

పరిగి, వెలుగు :  కుల, మతోన్మాదులను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్​రెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రాంతంలో కుల, మత సామరస్యత ఎక్కువ అని, ఇక్కడి జనం సమానత్వ భావనతో ఉంటారని చెప్పారు. బుధవారం పరిగి నియోకవర్గం కుల్కచర్లలో నిర్వహించిన కాంగ్రెస్​కార్నర్ మీటింగులో రంజిత్​రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. లోక్​సభ ఎన్నికల రణంలో గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పారు.

 బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేస్తున్న విష ప్రచారం నమ్మొద్దని, ఆ పార్టీ ఇస్తున్న మోసపూరిత హామీలను పట్టించుకోవద్దని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేశామని గుర్తుచేశారు. ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రంజిత్​రెడ్డి వెంట స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రాంమోహన్​రెడ్డి, కాంగ్రెస్​ముఖ్య నేతలు ఉన్నారు. 

ఇయ్యాల భారీ ర్యాలీతో నామినేషన్‌‌‌‌‌‌‌‌

గండిపేట/వికారాబాద్: చేవెళ్ల కాంగ్రెస్​ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గురువారం మరో సెట్​నామినేషన్​దాఖలు చేయనున్నారు. రంజిత్​రెడ్డి నామినేషన్​కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డిపాల్గొననున్నారు. అనంతరం పీవీఎన్ఆర్ ఎక్స్​ప్రెస్​వే పిల్లర్​నంబర్​154 నుంచి డెయిరీ ఫాం చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.