- ఎన్నికల రణంలో గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తం
- కుల్కచర్ల కార్నర్ మీటింగులో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి
పరిగి, వెలుగు : కుల, మతోన్మాదులను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్రెడ్డి అన్నారు. చేవెళ్ల ప్రాంతంలో కుల, మత సామరస్యత ఎక్కువ అని, ఇక్కడి జనం సమానత్వ భావనతో ఉంటారని చెప్పారు. బుధవారం పరిగి నియోకవర్గం కుల్కచర్లలో నిర్వహించిన కాంగ్రెస్కార్నర్ మీటింగులో రంజిత్రెడ్డి పాల్గొని మాట్లాడారు. దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల రణంలో గెలిచిన వెంటనే రుణమాఫీ చేస్తామని చెప్పారు.
బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేస్తున్న విష ప్రచారం నమ్మొద్దని, ఆ పార్టీ ఇస్తున్న మోసపూరిత హామీలను పట్టించుకోవద్దని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేశామని గుర్తుచేశారు. ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రంజిత్రెడ్డి వెంట స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రాంమోహన్రెడ్డి, కాంగ్రెస్ముఖ్య నేతలు ఉన్నారు.
ఇయ్యాల భారీ ర్యాలీతో నామినేషన్
గండిపేట/వికారాబాద్: చేవెళ్ల కాంగ్రెస్ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గురువారం మరో సెట్నామినేషన్దాఖలు చేయనున్నారు. రంజిత్రెడ్డి నామినేషన్కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డిపాల్గొననున్నారు. అనంతరం పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే పిల్లర్నంబర్154 నుంచి డెయిరీ ఫాం చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.