బీజేపీలో చేరినోళ్లు 15 లక్షలు

బీజేపీలో చేరినోళ్లు 15 లక్షలు
  •   రాష్ట్రంలో భారీగా సభ్యత్వాల నమోదు
  •   స్టేట్ ​లీడర్లకు నడ్డా అభినందనలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 15 లక్షల బీజేపీ సభ్యత్వాలు పూర్తి చేయడంపై ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, పార్టీ సభ్యత్వ ప్రముఖ్ శివరాజ్ సింగ్ చౌహాన్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వాలకు సంబంధించిన నివేదికను గురువారం రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ ప్రముఖ్ ధర్మారావు, సహ ప్రముఖ్ కాసం వెంకటేశ్వర్లు ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో జరిగిన పార్టీ సభ్యత్వ సమీక్షలో నడ్డాకు, చౌహాన్ లకు అందజేశారు. దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు ముగిసినా, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో మాత్రమే ఇంకా కొనసాగుతోంది. అయినా, షెడ్యూల్ ప్రకారమే పోలింగ్ బూత్ కమిటీల ఎన్నికలు జరుగుతాయని పార్టీ రాష్ట్ర నేతలకు జాతీయ నేతలు స్పష్టం చేసినట్లు తెలిసింది.