
తెలంగాణలో కరోనా కేసులు 88,396కు చేరాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1921 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. తాజాగా గురువారం కరోనా బారినపడి 9 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 674కు చేరింది. కొత్తగా 1210 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 64,284గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,438 కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా మరో 16,439 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.72 శాతంగా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇది భారత రికవరీ రేటు 70.76 శాతం కంటే ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో గురువారం 22,046 మందికి కరోనా టెస్టులు చేశారు. వాటిలె 1931 మందికి పాజిటివ్ గా వచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో చేసిన మొత్తం టెస్టుల సంఖ్య 7,11,196కు చేరింది.
ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 356, మేడ్చల్ 168, రంగారెడ్డి 134, వరంగల్ అర్బన్ 74, సంగారెడ్డి 90, సిద్ధిపేట 63, కరీంనగర్ 73, నల్గొండ 73, ఖమ్మం 71, పెద్దపల్లి 54, నిజామాబాద్ 63 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
For More News..