
- రూ. కోటి విలువైన 400 కిలోల గాంజా స్వాధీనం
జీడిమెట్ల, వెలుగు: ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని బాలానగర్ ఎస్ వోటీ, జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు, జీడిమెట్ల సీఐ పవన్, ఎస్ వోటీ సీఐ రాహుల్ దేవ్ శనివారం వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్కు చెందిన బబ్లూ కారే అలియాస్ కృష్ణ(23), గోవింద్ పాటిదార్(42) ఇద్దరూ లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. గంజాయి సప్లయ్కు స్కెచ్ వేశారు. రాజమండ్రి నుంచి మహారాష్ట్రలోని లాతూర్కు గంజాయి సప్లయ్ చేసేందుకు ఒడిశాకు చెందిన ఓ వ్యక్తితో డీల్ కుదర్చుకున్నారు.
అడ్వాన్స్గా వారికి రూ.75 వేలు ఇచ్చాడు. బబ్లూ, గోవింద్ ఇద్దరూ రాజమండ్రికి చేరుకుని రూ.కోటి విలువైన 400 కిలోల గంజాయిని 40 బండిల్స్లో ప్యాక్ చేసి లారీలో లోడ్ చేశారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వాటిపై నర్సరీ ప్లాంట్లను పెట్టారు. రాజమండ్రి నుంచి సిటీ మీదుగా లాతూర్కు బయలుదేరారు. దీని గురించి సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటీ, జీడిమెట్ల పోలీసులు శనివారం తనిఖీలు చేపట్టారు. బాలానగర్ వద్ద లారీని అడ్డుకుని తనిఖీ చేశారు. 400 కిలోల గంజాయిని గుర్తించారు. సరుకుతో పాటు లారీని, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బబ్లూ, గోవింద్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఘట్కేసర్లో 42 కిలోల గాంజా పట్టివేత
ఘట్కేసర్ : చర్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద శనివారం అనుమానాస్పదంగా తిరుగుతున్న బిహార్కు చెందిన అమిత్రకుమారి(43), ఢిల్లీలోని జేజే కాలనీకి చెందిన మంజు శర్మ(32), మహారాష్ట్రలోని కొల్హాపూర్కు చెందిన రవీంద్ర బిప్రచంద్ పాత్రో(52)ను మేడ్చల్ జిల్లా టాస్క్ఫోర్స్, ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ నుంచి హైదరాబాద్కు గంజాయిని తీసుకొస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని ఎక్సైజ్ సీఐ మల్లయ్య తెలిపారు.