శ్రీనగర్లోని కశ్మీర్ వర్శిటీ గేటు దగ్గర ఉగ్రవాదులు గ్రెనేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్రంగా గాయాలు కాగా… అనేక మంది గాయపడ్డారు. యూనివర్శిటీలోని సర్ సయ్యద్ గేటు దగ్గర ప్రజలు నిలబడి ఉన్న సమయంలో ఈ దాడి జరిగిందని పోలీఉలు తెలిపారు. ఎన్కౌంటర్ జోన్స్లోకి వెళ్లవద్దని, అక్కడక్కడా ఉండే పేలుడు పదార్థాలతో ప్రమాదం జరగవచ్చని పోలీసులు ప్రజలను హెచ్చరించిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది.