కెనడాలో జరిగిన కాల్పుల్లో భారత విద్యార్థి మృతి చెందాడు. టొరంటో నగరంలోని సబ్వే స్టేషన్ వద్ద గురువారం ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో కార్తీక్ వాసుదేవ్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఉన్న పారామెడికల్ సిబ్బంది ఒకరు వాసుదేవ్ కు వైద్య సహాయం అందించారు. తర్వాత వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు కార్తీక్ వాసుదేవ్ ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబద్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కార్తీక్ వాసుదేవ్ మృతి పట్ల విదేశాంగా మంత్రి జై శంకర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వాసుదేవ్ సెనెకా కాలేజీలో మేనేజ్ మెంట్ కోర్సు చదువుతున్నాడు. ఉద్యోగం కోసం బయటకెళ్లినప్పుడు కాల్పుల్లో అతడు మరణించినట్లు వాసుదేవ్ బ్రదర్ తెలిపారు.
Grieved by this tragic incident. Deepest condolences to the family. https://t.co/guG7xMwEMt
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 8, 2022