ఐఆర్​సీటీసీలో ఇకపై.. 24 టికెట్లు తీస్కోవచ్చు

ఐఆర్​సీటీసీలో ఇకపై.. 24 టికెట్లు తీస్కోవచ్చు

న్యూఢిల్లీ, వెలుగు: రైల్వే ప్రయాణికులకు ఐఆర్​సీటీసీ గుడ్​న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు ప్రయాణికులకు ఇచ్చే టికెట్ల పరిమితిని డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఒక నెలలో ఆధార్ లింక్ చేయని కస్టమర్ ఐడీపై ఇప్పటివరకు ఉన్న 6 టికెట్లు బుక్ చేసుకునే లిమిట్​ను 12 టికెట్లకు, ఆధార్ లింక్ చేసిన కస్టమర్ ఐడీపై 12 నుంచి 24 టికెట్లకు పెంచుతున్నట్టు ఐఆర్​సీటీసీ ప్రకటించింది.