జైలులో ఉన్న ఖైదీలనూ కరోనా మహమ్మారి వదలడం లేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 3వ తేదీన 900 మంది ఖైదీలకు పరీక్షలు చేయించారు జైలు అధికారులు. ఈ పరీక్షల్లో 247 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నెల ఒకటో తేదీన 75 మందికి పరీక్షలు చేయగా జైలులో విధులు నిర్వహిస్తున్న 24 మంది సిబ్బందికి, 9 మంది ఖైదీలకు, 2వ తేదీన 64 మందికి పరీక్షలు చేయగా 9 మంది ఖైదీలకు కరోనా సోకినట్లు తేలింది. సెంట్రల్ జైలులో మొత్తం 1,675 మంది ఖైదీలు ఉండగా వారిలో 265 మంది కరోనా బారినపడ్డారు. జైలు సిబ్బందిలో 24 మందికి పాజిటివ్ రాగా, వారందరినీ హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకటి, రెండో తేదీల్లో చేసిన పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన 18 మంది ఖైదీలకు జీఎస్ఎల్ ఆస్పత్రిలో చికిత్సకు పంపారు. అయితే వీరిలో ఒక ఖైదీ ఆస్పత్రి నుంచి పరార్ కావడంతో మొత్తం ఖైదీలను ఆస్పత్రి యాజమాన్యం డిశ్చార్జ్ చేసింది. అందులో 8 మంది బెయిల్పై విడుదల కాగా, వారు హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకోవాలని అధికారులు సూచించారు. మిగిలిన 10 మంది ఖైదీలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఉంచి చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3వ తేదీన చేసిన పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయిన 247 మంది ఖైదీలను బయటి ఆస్పత్రికి తరలిస్తే సెక్యూరిటీ సమస్య రావచ్చని అన్నారు జైలు సూపరింటెండెంట్ ఎస్.రాజారావు. భారీ సంఖ్యలో బెడ్లు కూడా ఏర్పాటు చేయవలసి ఉండడంతో ఖైదీలను సెంట్రల్ జైలులోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
ఖైదీలనూ వదలని కరోనా.. రాజమండ్రి సెంట్రల్ జైలులో 265 మందికి పాజిటివ్
- ఆంధ్రప్రదేశ్
- August 7, 2020
లేటెస్ట్
- MI vs SRH: కమ్మేసిన సూరీడు.. హైదరాబాద్కు తప్పని ఓటమి
- ఆల్ ది బెస్ట్ మేడమ్: రేపు అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్..ముచ్చటగా మూడోసారి
- T20 World Cup 2024: భారత వరల్డ్ కప్ జెర్సీకి కాషాయ రంగు.. నెట్టింట ట్రోలింగ్
- Malayalam Director Harikumar: ప్రముఖ దర్శకుడు,కథా రచయిత కన్నుమూత
- పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ లో రూ. 6 కోట్ల స్కాం
- Rajamouli Media Interaction: రేపు మీడియా ముందుకు రానున్న రాజమౌళి..మహేశ్తో సినిమాపై అప్డేట్!
- ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారా... ప్రాణాంతక వ్యాధులకు స్వాగతం చెప్పినట్టే..
- MI vs SRH: కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్.. గట్టెక్కిన సన్రైజర్స్
- 10 ఏండ్లు ప్రభుత్వంలో ఉండి ఏం చేశారో చెప్పాలి : శ్రీధర్ బాబు
- కాంగ్రెస్ కు ఓటేస్తే జిల్లాలను పోగొట్టుకోవాల్సి వస్తది : హరీష్ రావు
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో