ఒక్క రోజులో 28 వేల మందికి పాజిటివ్.. వైరస్ బారిన పడి 500 మంది మృతి

ఒక్క రోజులో 28 వేల మందికి పాజిటివ్.. వైరస్ బారిన పడి 500 మంది మృతి

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఒక్క రోజు వ్యవధిలోనే కరోనా వల్ల దేశంలో 500 మంది చనిపోగా.. 28,701 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8.78 లక్షలకు చేరింది. ఈ నెల 1 నుంచి 13 రోజుల వ్యవధిలో దేశంలో 5.85 లక్షల ఇన్ఫెక్షన్స్‌ నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగడం శుభసూచకం. ఇప్పటివరకు ఇండియాలో 5,53,470 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు. ఆది, సోమ వారాల్లో కలిపి 18,850 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేట్ 63%గా ఉంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలుగా ఉంది. ఇప్పటివరకు కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 23,174గా ఉంది.