మిలిటెంట్ల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

మిలిటెంట్ల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
  • మరో ఐదుగురికి గాయాలు

ఇంఫాల్‌: మయన్మార్‌‌ దగ్గర్లోని మణిపూర్‌‌ బోర్డర్‌‌లో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అస్సాం రైఫెల్స్‌ చనిపోయారు. ఈ ఘటనలో మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారని అధికారులు చెప్పారు. మణిపూర్‌‌లోని చాందల్‌ జిల్లాలో పేట్రోలింగ్‌ చేస్తున్న వారిపై పిపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (ఈఎల్‌ఏ) మిలిటెంట్లు కాల్పులు జరిపారని అన్నారు. నార్త్‌ఈస్ట్‌ రాష్ట్రాల్లో పీఎల్‌ఏ యాక్టివ్‌ మిలిటెంట్‌ గ్రూప్‌. ఇంఫాల్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ముందుగా ఐఈడీ బాంబుతో దాడి చేశారని, ఆ తర్వాత ఆయుధాలతో దాడి చేసినట్లు తెలుస్తోందని అధికారులు చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నట్లు చెప్పారు.