పుదుచ్చేరిలో 30 కిలోల ఉచిత బియ్యం

పుదుచ్చేరిలో 30 కిలోల ఉచిత బియ్యం

పుదుచ్చేరి: లాక్ డౌన్ తో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు తోచిన విధంగా బియ్యం, పప్పు, న‌గ‌దు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పుదుచ్చేరి రాష్ట్రం కీలక నిర్ణ‌యం తీసుకుంది రాష్ట్రంలోని ప‌సుపు రంగు రేష‌న్ కార్డు దారుల‌కు 30 కిలోల బియ్యం ఉచితంగా ఇచ్చేందుకు ఆ రాష్ట్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. దీంతో రేష‌న్ షాపుల్లో బియ్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. అటు స‌హ‌కార శాఖ సిబ్బందికి పెండింగ్ లో ఉన్న మూడు నెల‌ల జీతాలు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేసింది.