పింఛన్ కోసం 5 గంటల వెయిటింగ్

పింఛన్ కోసం 5 గంటల వెయిటింగ్

జనగామ జిల్లా: స్టేషన్ఘన్ పూర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణలో నెలనెలా పోస్టాఫీస్ సిబ్బంది ఆసరా పింఛన్ డబ్బులు పంపిణీ చేస్తారు. ఆగస్టు నెలకు సంబంధించి సోమవారం కొద్దిమందికి పంపిణీ చేశారు. మంగళవారం ఉదయం మిగిలినవారికి పంపిణీ చేస్తామని చెప్పడంతో ఉదయం 6 గంటలకే దివ్యాంగులు, వృద్ధు లు గ్రామపంచాయతీ ఆఫీస్కు చేరుకున్నారు. 11 గంటల వరకు పడిగాపులు కాశారు. వృద్ధులు పడిగాపులు కాస్తున్న విషయాన్ని పోస్ట్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లగా 11.30 గంటలకు సిబ్బంది వచ్చి పింఛన్ డబ్బులు పంపిణీ చేశారు. – స్టేషన్ ఘ‌న్ పూర్, వెలుగు