సదుపాయాలు లేవంటూ ఐసోలేషన్ కేంద్రం నుంచి ఇంటికి

సదుపాయాలు లేవంటూ ఐసోలేషన్ కేంద్రం నుంచి ఇంటికి

ఐసోలేషన్ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేవన్న కారణంతో కరోనా రోగి అయిన వృద్ధుడు అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకున్నాడు. మహారాష్ట్రలోని పుణెలో ఈ ఘటన జరింగి.  ఎరవాడకు చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో బల్వేడిలోని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు అధికారులు. అయితే… అక్కడ సరిగా తిండిపెట్టకపోవడం, కేంద్రం శుభ్రంగా లేకపోవడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. నడుచుకుంటూ 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి చేరుకున్నాడు.

ఇంటి దగ్గర కనిపించిన ఆ వృద్ధుడిని చుట్టుపక్కల వారు ప్రశ్నించడంతో అసలు విషయం తెలిసింది. దీంతో ఆ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. అధికారులు అతడి ఇంటికి చేరుకుని మళ్లీ ఐసోలేషన్ కేంద్రానికి పంపేందుకు ప్రయత్నించారు. అయితే అతను ఒప్పుకోక పోవడంతో…అతడి కుమారుడితో మాట్లాడించి ఒప్పించడంతో తిరిగి వెళ్లేందుకు అంగీకరించాడు. ఐసోలేషన్ కేంద్రం నుంచి నడిచి వచ్చే సమయంలో తాను ఎవరినీ కలవలేదని చెప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.