ఎస్ఐపై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

ఎస్ఐపై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

జనగాం జిల్లా రఘునాథపల్లి ఎస్ఐపై అదే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాను ఇచ్చిన ఫిర్యాదును తిరస్కరించి, బెదిరింపులకి గురిచేయడమే కాకుండా  తనపైనే అక్రమ కేసు నమోదు చేశాడని కంచనపల్లి గ్రామానికి చెందిన రాంమూర్తి అనే బాధితుడు న్యాయస్థానాన్ని..హెచ్ఆర్సీని ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ అశోక్ తో పాటు మరో11  మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో ఎ-11గా ఎస్ఐ అశోక్ ను చేర్చారు.

మైనర్ పై రెండేండ్లుగా ఏఎస్సై అత్యాచారం