
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి పలు జిల్లాల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహిళల కోసం ఉమెన్ పోలింగ్ స్టేషన్స్, యువత కోసం యూత్ పోలింగ్ కేంద్రాలు, వికలాంగుల కోసం ప్రత్యేక పోలింగ్సెంటర్లను ఏర్పాటు చేశారు. మహిళా పోలింగ్స్టేషన్లలో సిబ్బంది కూడా మహిళలే కాగా, యూత్ పోలింగ్ కేంద్రాల్లో యువతను స్టాఫ్గా నియమించారు.
ఈ సెంటర్లలో ప్రత్యేకంగా షామియానాలు వేయడంతో పాటు పూలతో అలంకరించారు. బెలూన్స్తో డెకరేట్ చేశారు. బాలింతలకు స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. తల్లులు తమ పిల్లలతో వస్తే చిన్నారులు ఆడుకునేందుకు క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచారు. ఎండ నుంచి ఉపశమనానికి కూలర్లు పెట్టారు. వికలాంగులను పోలింగ్కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు ఆటోలను సిద్ధం చేశారు. కొన్ని చోట్ల సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేశారు. - వెలుగు నెట్వర్క్