ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు రాజాసింగ్ పై కేసు నమోదు..

ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు రాజాసింగ్ పై కేసు నమోదు..

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు నమోదైంది. సుమోటోగా కేసు నమోదు చేశారు సుల్తాన్ బజార్‌ పోలీసులు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్‌ వ్యాయామశాల వద్ద స్పీచ్ ఇస్తూ.. ఎన్నికల నియమావళి ఉల్లఘించినట్లు ఎస్‌ఐ మధుసుధన్‌ తెలిపారు. ఐపీసీ 188,290 రెడ్‌ విత్‌ 34, సిటీ పోలీస్‌ యాక్ట్‌ 21/76 కింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.  

ఇదిలా ఉండగా ఈ నెల 18న రాజాసింగ్ పై అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా అధిక సంఖ్యలో భక్తులతో శోభాయాత్ర నిర్వహించినందుకు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగౌడ వద్ద నిలిపి బాణసంచా కాల్చారని, ర్యాలీ ఆపి ప్రసంగిస్తూ భక్తులు, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినట్టు పేర్కొన్నారు.