కెమికల్ డ్రమ్ పేలి ఒకరు మృతి.. మ‌రో ముగ్గురి పరిస్థితి విషమం

కెమికల్ డ్రమ్ పేలి ఒకరు మృతి.. మ‌రో ముగ్గురి పరిస్థితి విషమం

హైద‌రాబాద్‌: కెమికల్ కంపెనీలోని ఓ డ్రమ్ పేలడంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం. చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని బీఎన్ రెడ్డి నగర్‌లో గత మూడు సంవత్సరాల క్రితం ఓ కెమికల్ కంపెనీ నిర్వహించేవారు. అయితే ఆ షెడ్ కు పేయింట్ వేస్తుండగా, అందులోని ఓ డ్రమ్ ను జరిపే ప్రయత్నం చేశాడు ఓ వ్యక్తి. అకస్మాత్తుగా ఆ డ్రమ్ లో కెమికల్ ఉండడంతో ఒక్కసారిగా పేలి నర్సింహాచారి (45) అనే వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా అక్క‌డే ఉన్న‌ జహంగీర్ (44), ఇజాజ్ (19), వెంకటేష్ (27)లకు తీవ్ర గాయాలపాలయ్యారు. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ ముగ్గురిని ఈసిఐఎల్‌లోని ప్రైవేట్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంద‌ని ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ అన్నారు.