సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చనిపోయిన రోహిత్ వేముల కేసును క్లోజ్ చేయటం.. రోహిత్ వేముల కులంపై పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ను సమీక్షించాలని.. కేసును మళ్లీ విచారించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు రోహిత్ వేముల తల్లి రాధిక.

2024, మే 4వ తేదీ ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్వయంగా విన్నవించుకున్నారు రాధిక మేముల. గత ప్రభుత్వం కావాలనే ఈ కేసు విచారణను తప్పుదోవ పట్టించిందని.. కేసు క్లోజ్ చేసిందని అనుమానాలు వ్యక్తం చేసింది ఆమె. 

రోహిత్ వేముల కేసు విచారణను తిరిగి చేపట్టాలని.. న్యాయం చేయాలని కోరింది. రోహిత్ వేముల కులంపైనా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని.. దళితుడే అని స్పష్టం చేసిందామె. ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీగా ఉందని.. న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.