హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం

హనుమాన్ ఆలయానికి విరాళంగా భూమి ఇచ్చిన ముస్లిం

 హైదరాబాద్, వెలుగు :  మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన ఓ ముస్లిం స్థానికంగా నిర్మించిన హనుమాన్​ఆలయానికి 5 గుంటల భూమిని విరాళంగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. మేడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన వీరాంజనేయస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణం కోసం దాదాపు 5 గుంటలు(600 చదరపు గజాలు) భూమిని విరాళంగా ఇచ్చిన గ్రామస్తుడు సలావుద్దీన్ ను మెచ్చుకున్నారు. ఆలయానికి భూమి ఇచ్చి, మత సామరస్యాన్ని చాటుకున్నారని కొనియాడారు.