సిటీ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో కారులో వెళ్లేవారందరికీ తప్పని సరి కానున్న సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌

సిటీ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో కారులో వెళ్లేవారందరికీ తప్పని సరి కానున్న సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌

లేకపోతే ఫైన్ విధించనున్న సిటీ ట్రాఫిక్ పోలీసులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: సిటీ ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌లో కారులో వెళ్లేవారందరికీ ఇకపై సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌ తప్పని సరి కానుంది. కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తితో పాటు ముందు, వెనుక సీట్లలో కూర్చున్న వాళ్లు కూడా సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవాల్సిందే. లేకపోతే సిటీ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించనున్నారు. ఇందుకోసం స్పెషల్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. కారు ప్రమాదాల్లో ప్రాణహానిని తగ్గించేందుకు మూడంచెల సేఫ్టీ మెజర్స్‌‌‌‌‌‌‌‌ తీసుకోనున్నారు. సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోకపోతే జరిగే ప్రమాదాల గురించి వివరిస్తూ వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఆపై స్పెషల్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్ నిర్వహించి సీటు బెల్ట్​ పెట్టుకోని వారిపై మోటార్ వెహికల్ యాక్ట్‌‌‌‌‌‌‌‌ ప్రకారం ఫైన్ విధించనున్నారు.

అందరికీ మంచిదే..

నిర్లక్ష్యంగా డ్రైవ్‌‌‌‌‌‌‌‌ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం బాధిత కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి సమయంలో బైక్‌‌‌‌‌‌‌‌ రైడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి హెల్మెట్​, కారు నడిపేవారికి సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌ రక్షణ కల్పిస్తున్నది. కానీ చాలా మంది  కారులో సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోవడాన్ని  లైట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారు. డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌ సీటులో ఉన్న వ్యక్తి మినహా ముందు, వెనుక కూర్చున్న వారు సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌ను పెట్టుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నారు. సాధారణంగా డ్రైవర్ తప్ప మిగతా సీట్లలో కూర్చున్న వారికి సీట్ బెల్ట్ విషయాన్ని ఇప్పటివరకు పోలీసులు పట్టించుకోలేదు. బెల్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టుకోని డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మాత్రమే గుర్తించి ఫైన్ విధించేవారు.

బలమైన గాయాలు కాకుండా..

కారు ప్రమాదం జరిగితే వెనుక సీటులో ఉన్న వారు డ్రైవర్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌‌‌‌‌‌‌‌ బోర్డ్, సైడ్ విండోస్‌‌‌‌‌‌‌‌ను ఢీకొనే అవకాశాలుంటాయి. అయితే సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల వారు ముందుకు పడిపోయే ఛాన్స్ ఉండదు.  ఫలితంగా తల, ఛాతి, వెన్నెముక సహా పొట్ట భాగంలో బలమైన గాయాలు కాకుండా కాపాడుకోవచ్చు. ఇలాంటి వాటి గురించి వివరిస్తూ సిటీ  పోలీసులు స్పెషల్‌‌‌‌‌‌‌‌ అవేర్ నెస్ ఆల్బమ్ తయారుచేస్తున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అవగాహన కల్పించనున్నారు.  డ్రైవ్‌‌‌‌‌‌‌‌ చేసే వారితో పాటు కారులోని మిగతా వారికి ప్రమాదాల గురించి వివరించనున్నారు. పాంప్లెంట్స్, డిజిటల్ బోర్డులతో ప్రచారం చేసేలా ప్లాన్ చేశారు. మరో వారం రోజుల్లో ఇది మొదలయ్యే అవకాశాలున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

ప్రాణ నష్టం తగ్గించేందుకే..

 రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టాం. కారులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీటు బెల్ట్‌‌‌‌‌‌‌‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇటీవల సిటీలో చేపట్టిన ఆపరేషన్ రోప్ , సిగ్నళ్ల దగ్గర వాహనదారులు స్టాప్ లైన్ ను దాటకుండా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి.

- సీవీ ఆనంద్‌‌‌‌‌‌‌‌, సీపీ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌