తేనేటీగల మంట అంటిస్తుండగా ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం

తేనేటీగల మంట అంటిస్తుండగా ప్రమాదం..  వ్యక్తి సజీవ దహనం

నారాయణపేట జిల్లా : మక్తల్ లో ఘోరం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు మంటలు అంటుకొని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. బస్సులో తేనేటీగల తుట్టెకు మంట అంటిస్తుండగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. ఘటనలో పక్కనే ఉన్న మరో రెండు బస్సులు కాలిపోయాయి. చనిపోయిన వ్యక్తిని మక్తల్ పట్టణానికి చెందిన మహాదేవ్ గా గుర్తించారు పోలీసులు.