రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఎయిమ్స్ డాక్టర్లు విజయవంతంగా బైపాస్ సర్జరీ నిర్వహించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆయన త్వరలోనే కోరుకోవాలని ఆకాంక్షించారు.
ఛాతీలో నొప్పి కారణంగా ఈ నెల 26న రాష్ట్రపతి కోవింద్ ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు అక్కడ సాధారణ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ తర్వాత తదుపరి వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్కు సిఫార్సు చేశారు. గత శనివారం ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు.