KCR  నుంచి తెలంగాణను విముక్తి చేయడమే లక్ష్యం

KCR  నుంచి తెలంగాణను విముక్తి చేయడమే లక్ష్యం

KCR పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయడమే తమ లక్ష్యమన్నారు బండి సంజయ్. మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆరె మైసమ్మ టెంపుల్ దగ్గర నిర్వహించిన సభలో సంజయ్ మాట్లాడారు. రెచ్చగొట్టడం స్టార్ట్ చేయకముందే TRS నేతలు భయపడుతున్నారన్నారు సంజయ్. దేశం నుంచి MIM పార్టీని తరిమికొడుతామన్నారు. నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుని హిందువులకు పంచుతామన్నారు సంజయ్. 80% ఉన్న హిందువుల అభివృద్ధి కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరు మీదనే  భాగ్యనగరంగా ఏర్పడిందన్నారు బండి సంజయ్.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని MIM తో కేసీఆర్ దోస్తీ వెనుక రహస్యం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత నిజాం సమాధి దగ్గర మోకరిల్లాడుని విమర్శించారు. ఒక్క కుటుంబం చేతిలో బంధీ అయిన తెలంగాణ తల్లి ఘోషిస్తోందన్న బండి సంజయ్.. 111 జీవో రద్దు హామీని ఇప్పటివరకూ కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. 2023 లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే తమ లక్ష్యమన్నారు సంజయ్.