
జార్ఖండ్: మావోయిస్టులు మాట్లాడే బాష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. మావోయిస్ట్ భాష షెహజాదాలో మాట్లాడటంతో.. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టే ముందు ఏ పారిశ్రామికవేత్త అయినా 50 సార్లు ఆలోచిస్తారని మోదీ విరుచుకుపడ్డారు.
మే 19వ తేదీ ఆదివారం జంషెడ్పూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ వంశపారంపర్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. లోక్సభ స్థానాలను పూర్వీకుల ఆస్తులుగా పరిగణిస్తోందని ఆరోపించారు. పారిశ్రామిక వ్యతిరేక భాష షెహజాదాను అంగీకరిస్తారా లేదా అనే దానిపై కాంగ్రెస్, భారత కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలు సమాధానం చెప్పాలని నిలదీశారు.
రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న రాహుల్ ను విమర్శించారు. "ఇది మా అమ్మ సీటు".. ఎనిమిదేళ్ల పాఠశాల బాలుడు కూడా ఇలా చెప్పడంటూ రాహుల్ ను మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ.. తమ పాలనలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయిందని ఆరోపించారు. దాదాపు 18,000 గ్రామాల పరిస్థితి.. 18వ శతాబ్దానికి చెందిన గ్రామాల మాదిరిగా గత ప్రభుత్వ హయాంలో ఉండేదని మోదీ ఫైర్ అయ్యారు.