పోలీసులపై దాడి చేసిన కార్పొరేటర్ పై కేసు

పోలీసులపై దాడి చేసిన కార్పొరేటర్ పై కేసు

హైదరాబాద్: విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులను అడ్డుకున్నారనే ఆరోపణలతో ఏఐఎంఐఎం కార్పొరేటర్ ముర్తజా అలీపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం హైదరాబాద్ లోని చావ్లీ ప్రాంతంలోని ఓ మతపరమైన ప్రదేశంలో డ్యూటీ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్ ను స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ ముర్తజా, ఆయన అనుచరులు అడ్డుకొని వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన ప్రసాద్ అనే కానిస్టేబుల్ విషయాన్ని సీనియర్ అధికారులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు కార్పొరేటర్ ముర్తజా అలీపై కేసు బుక్ చేశారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలన్నారు.