యాదాద్రి భువనగిరి జిల్లా : నేడు రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. అయితే లాక్ డౌన్ ఉండటంతో పలుచోట్ల సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ జయంతిని జరుపుతున్నారు.
ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం గోల్నేపల్లి గ్రామంలో బాబా సాహెబ్ అంబేద్కర్ 129వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.పెద్దలతో మొదలుకొని యువత చిన్నారులు సోషల్ డిస్టన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు .ఇదే తరహాలో రాష్ట్రమంతా సోషల్ డిస్టన్స్ పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలని కోరారు.
ఇంట్లోనే నివాళి..
లాక్ డౌన్ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా, వీరవెల్లి గ్రామంలో ఇంటిలోనే అంబేద్కర్ కు నివాళి అర్పించి అభిమానం చాటుకున్నారు ఆయన అభిమానులు. ఫొటోకు పూలమాలవేసి, నివాళులర్పించారు.