యుపీ గవర్నర్‌గా ఆనందిబెన్‌ పటేల్‌  ప్రమాణం

యుపీ గవర్నర్‌గా ఆనందిబెన్‌ పటేల్‌  ప్రమాణం

ఉత్తర్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా ఆనందిబెన్‌ పటేల్‌ ఇవాళ(సోమవారం) ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆనందిబెన్‌ పటేల్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గోవింద్‌ మాథూర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటి వరకూ ఆనందిబెన్‌ పటేల్‌ మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యుపీ గవర్నర్‌గా పదవీ విరమణ చేస్తున్న రామ్‌ నాయిక్‌ కూడా పాల్గొన్నారు.