కీలక బిల్లులకు ఇవాళ ఏపీ అసెంబ్లీ ఆమోదం

కీలక బిల్లులకు ఇవాళ ఏపీ అసెంబ్లీ ఆమోదం

 అమరావతి : ఇవాళ పలు బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. బీసీ సబ్ ప్లాన్ బిల్లుకు ఆమోదం తెలపనుంది అసెంబ్లీ. కాపులకు ఐదు శాతం, కాపులు కాకుండా మిగిలిన అగ్రవర్ణ పేదలకు 5శాతం  రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపనుంది. సహకార సొసైటీల సవరణ బిల్లు కూడా శాసనసభలో పాస్ కానుంది.

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఇవాళ అసెంబ్లీలో చర్చ కొనసాగుతుంది. షెడ్యూల్ ప్రకారం… సామాజిక సాధికారత, మానవ వనరుల అభివృద్ధిపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చను నిర్వహించే సూచనలు ఉన్నాయి.