ఈరోజు కేసీఆర్​ను పరామర్శించనున్న ఏపీ సీఎం జగన్

ఈరోజు కేసీఆర్​ను పరామర్శించనున్న ఏపీ సీఎం జగన్

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్​ను ఏపీ సీఎం జగన్ గురువారం పరామర్శించనున్నారు. ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 11.15 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 

అక్కడి నుంచి నందినగర్ లోని కేసీఆర్ ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శిస్తారు.గంటకుపైగా కేసీఆర్ తో జగన్  సమావేశమవ్వనున్నారు.