ఆరుగురు అనుమానాస్పద మృతి

ఆరుగురు అనుమానాస్పద మృతి

బీహార్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. బక్సర్ లోని అంసారి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఆరుగురు చనిపోయారు.  ఈదుర్ఘటన రాత్రి జరిగింది. అయితే దీనికి కారణం కల్తీ మద్యం అని స్థానికులు, మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు? మద్యం నిషేధం ఉంటే.. మద్యం ఎలా దొరుకుతుంది అంటూ.. ప్రశ్నిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కల్తీ మద్యం తాగి మరణించారా ? లేక మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్న  కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.