జగిత్యాల: గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేని నిలదీసినందుకు యువకులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కోనాపూర్లో వెలుగుచూసింది. తమ గ్రామ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ కొంతమంది యువకులు.. ఎమ్మెల్యే రవిశంకర్ని ప్రశ్నించారు. దాంతో ఎమ్మెల్యే పీఏ యువకులతో వాగ్వావాదానికి దిగడంతో.. పీఏకు యువకులకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. యువకులు తమపై దాడిచేశారంటూ ఎమ్మెల్యే అనుచరులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అరెస్టుచేసిన వారిని వెంటనే విడుదల చేయాలని స్థానికులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
For More News..
‘బీస్ట్’ ట్రైలర్ మామూలుగా లేదుగా..