వ్యాక్సిన్ వేసిన ఆశావర్కర్.. నోటీసులిచ్చిన అధికారులు

వ్యాక్సిన్ వేసిన ఆశావర్కర్.. నోటీసులిచ్చిన అధికారులు

యాదాద్రి, వెలుగు: ఆశ వర్కర్​ కరోనా వ్యాక్సిన్​ ఇవ్వడంతో జిల్లా వైద్యాధికారితో పాటు మండల వైద్యాధికారికి షోకాజ్​నోటీసులు అందాయి. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ధర్మారంలో ఆశా వర్కర్.. ఇటీవల ఓ యువకుడికి కరోనా వ్యాక్సిన్​ వేసింది. వ్యాక్సిన్​ వేస్తుండగా తీసిన ఫోటోలు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల చేతికి అందాయి. దీంతో సీరియస్​ అయిన ఆఫీసర్లు యాదాద్రి జిల్లా డీఎంహెచ్​వో సాంబశివరావును వివరణ కోరడంతో పాటు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. దీంతో తుర్కపల్లి పీహెచ్​సీ వైద్యాధికారి చంద్రారెడ్డి, ఇతర స్టాఫ్​పై డీఎంహెచ్​వో సాంబశివరావు సీరియస్​ అయ్యారు. ఆశ వర్కర్​తో ఎలా వ్యాక్సిన్​ ఇప్పిస్తారని నిలదీశారు. డ్యూటీని నిర్లక్ష్యం చేసినందుకు వైద్యాధికారితో పాటు స్టాఫ్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.