అయ్యప్ప సేవా సమితి నిర్వాహకుల ఔదార్యం
హైదరాబాద్, వెలుగు: మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ కార్పొరేషన్లో వాటర్మెన్గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి భార్య అనారోగ్య కారణంగా చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు తిరుపతి కుటుంబానికి 8 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యువజన నాయకులు మేకల భార్గవ్ రామ్, కార్పొరేటర్ గొడుగు వేణు తదితరులు పాల్గొన్నారు.