వాటర్​మెన్​ కుటుంబానికి ఆర్థిక సహాయం

వాటర్​మెన్​ కుటుంబానికి ఆర్థిక సహాయం

అయ్యప్ప సేవా సమితి నిర్వాహకుల ఔదార్యం

హైదరాబాద్​, వెలుగు: మేడ్చల్​ జిల్లా, జవహర్​ నగర్​ కార్పొరేషన్​లో వాటర్​మెన్​గా విధులు నిర్వహిస్తున్న తిరుపతి భార్య అనారోగ్య కారణంగా చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప సేవా సమితి నిర్వాహకులు తిరుపతి కుటుంబానికి 8 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్​ఎస్​ యువజన నాయకులు మేకల భార్గవ్​ రామ్​, కార్పొరేటర్​ గొడుగు వేణు తదితరులు పాల్గొన్నారు.