కేటీఆర్ ఫాం హౌజ్పై డ్రోన్ కెమెరా ఉపయోగించిన కేసులో జైలులో రిమాండ్లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత కొన్ని రోజులుగా చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఈ రోజు బెయిల్ లభించింది. అయితే కోర్టు ఆయనకు కొన్ని షరతులు విధించింది. రెండు పదివేల రూపాయల షూరిటీలు ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా.. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
For More News..