Bellamkonda Sreenivas: బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్..వరుస లైనప్ మూవీస్ చూస్తే షాకే!

Bellamkonda Sreenivas: బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్..వరుస లైనప్ మూవీస్ చూస్తే షాకే!

టాలీవుడ్లో ఫేమస్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas).తనదైన యాక్షన్, కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు.

ప్రస్తుతం భీమ్లా నాయక్  డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్షన్లో టైసన్ నాయుడు అనే సినిమాలో నటిస్తున్నాడు.రీసెంట్గా టైసన్ నాయుడు నుంచి పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

అలాగే సాయి శ్రీనివాస్ ఖిలాడీ డైరెక్టర్ రమేష్ వర్మ తో రాక్షసుడు 2 సినిమాను చేస్తున్నారు. రాక్షసుడు వంటి క్రైమ్ థ్రిల్లర్ కథతో సాయి మంచి సక్సెస్ అందుకున్నారు.ఇపుడు రాక్షసుడు 2 వస్తుండటంతో మరోసారి హిట్ అందుకోవడం కన్ఫమ్ అనేలా అంచనాలున్నాయి.

అంతేకాకుండా సాయి శ్రీనివాస్ మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యి, వాటిల్లో ఒక సినిమా షూటింగ్ కూడా షురూ చేశాడని తెలుస్తోంది. వీటితో పాటుగా కౌశిక్ దర్శకత్వంలో “కిష్కిందపురి” అనే సినిమాకు సంతకం చేయగా..అది త్వరలోనే షూటింగ్ షురూ కానుంది.

ఇదిలా ఉంటే..ఈ హీరో త్వరలోనే ఓ బిగ్గెస్ట్ మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.ఆ సినిమా ఏకంగా రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ సినిమా ద్వారా బైరెడ్డి అనే దర్శకుడు పరిచయం కానున్నారు.బెల్లంకొండ శ్రీనివాస్ కి స్క్రిప్ట్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మేకర్స్ ప్రీ ప్రొడ క్ష న్ వర్క్స్ కూడా కంప్లీట్ దశకు వచ్చాయి.

అయితే, ఈ సినిమాను షురూ చేయడానికి సరైన నిర్మాణ సంస్థ కోసం డైరెక్టర్ అండ్ హీరో ఎదురుచూస్తున్నారు.బెల్లంకొండ శ్రీనివాస్ షైన్ స్క్రీన్స్ మరియు మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.అందులో ఒకరు ఈ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా చేయబోతున్నారు.జూలై నుంచి షూటింగ్ ప్రారంభం కానుండడంతో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది.

అలాగే బెల్లంకొండ మరిన్ని కథలు వింటున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ల గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.