సుశాంత్‌ సింగ్‌ సూసైడ్‌: సీబీఐ విచారణకు బీహార్‌‌ ప్రభుత్వం సిఫారసు

సుశాంత్‌ సింగ్‌ సూసైడ్‌: సీబీఐ విచారణకు బీహార్‌‌ ప్రభుత్వం సిఫారసు

పాట్నా: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ జరపాలని బీహార్‌‌ ప్రభుత్వం కోరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని బీహార్‌‌ సీఎం నితీశ్‌కుమార్‌‌ మంగళవారం ప్రకటించారు. సుశాంత్‌ తండ్రి కృష్ణ కుమార్‌‌ బీహార్‌‌ సీఎం నితీశ్‌ కుమార్‌ని కలిసి విచారణ చేపట్టాలని కోరారు. ఈ మేరకు కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించినట్లు జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్‌ సింగ్‌ చెప్పారు. కుటుంబసభ్యులు కోరినందుకే కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపాదించామని నితీశ్‌ అన్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం మొదటి నుంచి ఒక మిస్టరీగానే ఉండిపోయింది. దీనిపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ వచ్చిన విషయం తెలిసిందే. కాగా.. సుశాంత్‌ కేసులో ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌‌ నమోదు చేయకపోవడంతో బీహార్‌‌ పోలీసులు పాట్నాలో ఎఫ్‌ఐఆర్‌‌ ఫైల్‌ చేశారు. విచారణ కోసం పాట్నా పోలీసులు ముంబైలో దర్యాప్తు మొదలుపెట్టారు. రియాపై అనుమానాలు ఉన్నాయని, ఆయన తండ్రి కేసు పెట్టిన విషయం తెలిసిందే.