పల్లెప్రగతిలో ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం

పల్లెప్రగతిలో ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం

వరంగల్: పల్లె ప్రగతి కార్యక్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో బుధవారం జరిగిందీ ఘటన. పల్లెప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పాల్గొని మాట్లాడుతుండగా ఓ స్థానికుడు వచ్చి సమస్యలపై నిలదీశారు. తమ సమస్యలు ఎక్కడ పరిష్కారమయ్యాయని నిలదీశాడు. మైకు తీసుకుని నువ్వే మాట్లాడి ఏ సమస్యలో చెప్పమంటే మీరే వచ్చి చూడమంటూ అతను వాగ్వాదానికి దిగాడు. అన్నీ అబద్దాలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతుండడంతో ఎమ్మెల్యే రాజయ్య పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు వాగ్వాదం చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని దూరం తీసుకువెళ్లారు. మండలంలో పల్లె ప్రగతి నిరసన ల మధ్య కొనసాగింది.