ఆరేళ్ల పాపను రేప్‌ చేసిన రాక్షసుడిని వెంటనే ఉరి తీయాలి

ఆరేళ్ల పాపను రేప్‌ చేసిన రాక్షసుడిని వెంటనే ఉరి తీయాలి

ఆరేండ్ల బాలికపై అతి కిరాతకంగా అత్యాచారం చేసి, చంపిన నిందితుడిని వెంటనే ఉరి తీయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై ఓ ఆటో డ్రైవర్ అకృత్యానికి ఒడిగట్టిన ఘటనకు నిరనసనగా ఏఎస్‌రావు నగర్‌‌ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు రోహిన్‌ కుమార్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా మోర్చా నేత రూపా రెడ్డి, రోహిన్‌ కుమార్‌‌ మాట్లాడుతూ అభంశుభం తెలియని చిన్నారి అడుకుంటున్న సమయంలో గుట్టు చప్పుడు కాకుండా ఎత్తుకెళ్లి పైశాచిక దాడి చేసి, హతమార్చిన నిందితుడిని వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రమంతా ఆందోళనలు చేస్తామన్నారు. ఇటువంటి ఘోరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నా కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా నేత సంధ్యా రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ సూర్యనారాయణ, బీజేవైఎం నాయకులు వంశీ రెడ్డి, అరుణ్ కుమార్, అయ్యప్ప చౌదరి, సూర్య పవన్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.