ఎమ్మెల్యే మైనంపల్లిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

ఎమ్మెల్యే మైనంపల్లిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ సీపీకి వినతి పత్రాన్ని అందించారు బీజేపి నాయకులు. మల్కాజ్‌గిరి కార్పొరేటర్ పై జరిగిన దాడికి నిరసనగా బందు పాటిస్తున్న బీజేపి నాయకులను నేరెడ్మెట్ పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే సమయానికి ఎఫ్ఐఆర్ చేయకుండా, దాడులు చేసిన వారిని వదిలేసి, దెబ్బలు తిన్నవారిపై కేసులు నమోదు చేశారన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడికి మల్కాజిగిరి పోలీసులు పనిచేస్తున్నారన్నారు.  మైనంపల్లిపై, అతని అనుచరులపై పీడీ యాక్ట్ నమోదు చేసి న్యాయం చేయాలని బీజేపి మేడ్చల్ అర్బన్ డిస్ట్రిక్ ప్రెసిడెంట్ పన్నాల హరీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భాను ప్రకాష్, కార్పొరేటర్లు సునితా యాదవ్, రాజ్యలక్ష్మిలు సీపికి వినతి పత్రం అందించారు.