ఢిల్లీలో బాంబు భయంతో జనం పరుగులు పెట్టారు. ఘాజీపూర్ పూల మార్కెట్లో IED బాంబును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు పోలీసులు. ఫైర్ ఇంజిన్లను స్పాట్ కు రప్పించారు. ఆ ఏరియాను మొత్తం ఐసోలేట్ చేశారు.
హుటాహుటీన మార్కెట్ దగ్గరకు చేరుకున్న బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఎన్ఎస్ జీ బలగాలు ఆ బ్యాగులోని బాంబును నిర్జన ప్రదేశానికి తరలించి అక్కడ పేల్చివేశాయి. సకాలంలో బాంబును గుర్తించడంతో పెనుప్రమాదం తప్పినట్టయింది. దీనిపై ఢిల్లీ స్పెషల్ పోలీసు విభాగం కేసు నమోదు చేసింది. బాంబు ఎవరు పెట్టారన్న దానిపై దర్యాప్తు షురూ చేసింది.
మరిన్ని వార్తల కోసం..