- రన్నరప్గా నిలిచిన ఆస్ట్రేలియా జోడీ
ఆదివారం బాలేవాడి స్టేడియంలో జరిగిన మహారాష్ట్ర ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో భారత జోడీ రోహన్ బోపన్న- రామ్కుమార్ రామనాథన్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. గంట 45 నిమిషాలు సాగిన ఆ మ్యాచ్ లో భారత జోడీ వరుసగా 7-6 (10), 3-6, 6-10 తేడాతో ఆస్ట్రేలియా టాప్ సీడ్లు లూక్ సవిల్లే- జాన్ ప్యాట్రిక్ స్మిత్ ద్వయాన్ని ఓడించింది. జనవరిలో బోపన్న-రామనాథన్ జంట అడిలైడ్ అంతర్జాతీయ టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రామ్కుమార్ రామనాథన్కి ఇది రెండో ఏటీపి టూర్ టైటిల్ కాగా, వెటరన్ రోహన్ బోపన్నకు 21వ ఏటీపి టూర్ ట్రోఫీ.
ఇవి కూడా చదవండి..