- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్
ఈ నెల 11న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జనగామలో పర్యటించనున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జిల్లా కలెక్టర్ శివలింగయ్య తదితరులు సీఎం టూర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడతారని తెలిపారు. బహిరంగ సభకు తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండ గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం సభ వేదిక నిర్మాణంపై సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
చరణ్జిత్ సింగ్ చన్నీయే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి
ఆ పాట నా కెరీర్కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్