చరణ్జిత్ సింగ్ చన్నీయే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి

చరణ్జిత్ సింగ్ చన్నీయే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి
  • టెలిపోల్ ద్వారా అభ్యర్థి ఎంపిక
  • ప్రకటించిన రాహుల్ గాంధీ
  • నవజోత్ సింగ్ సిద్ధూకు దక్కని అవకాశం

పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీనే ప్రకటించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దీంతో రేసులో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు నిరాశే మిగిలింది. తీవ్ర ఉత్యంఠ రేపిన సీఎం అభ్యర్థి ఎంపిక  కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది. దీంతో అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని పంజాబ్ ప్రజలు, కార్యకర్తలు, యువకులకే వదిలేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. పార్టీ సంప్రదాయానికి విరుద్ధంగా టెలిపోల్ ద్వారా అభ్యర్థి ఎంపికను చేపట్టింది. చన్నీ ఓ వైపు ..సిద్ధూ మరో వైపు అభ్యర్థి పోటీలో తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ అదృష్టం చివరికి చన్నీనే వరించింది. టెలిపోల్ లో చన్నీకే ఎక్కువ మంది ఓటేశారు. కాగా అభ్యర్థి ఎంపికలో పార్టీ నిర్ణయం కంటే పంజాబ్ ప్రజల నిర్ణయమే ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు. పంజాబ్ ప్రజలు, కార్యకర్తల నిర్ణయం మేరకే కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఎంపిక చేసినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. అయితే తమ అధినేత రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరు దానికి కట్టుబడి ఉంటామని సిద్ధూ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి..

 

రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి

తెలుగు సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు