టాస్ భారత్‌దే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!

టాస్ భారత్‌దే.. ప్లేయింగ్ ఎలెవన్‌లో వైభవ్ సూర్యవంశీకి నో ఛాన్స్!

IND vs IRE: బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అందరూ ఎంతగానో ఎదురు చూసిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ ముచ్చట ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించినా.. జట్టు కాంబినేషన్ పరంగా మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెప్టెన్ స్పష్టం చేశాడు.

వైభవ్ ఎందుకు ఆడట్లేదో చెప్పిన కెప్టెన్ శ్రేయస్: 
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న తర్వాత శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇక్కడి కండిషన్స్ మాకు కొత్తవని, అందుకే మొదట బౌలింగ్ చేస్తున్నామని చెప్పాడు. ఇక దురదృష్టవశాత్తూ వైభవ్ ఈరోజు మ్యాచ్ ఆడటం లేదు.. మా టీంలో అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు.. గతంలో మంచి ప్రదర్శన చేసిన సీనియర్ ప్లేయర్ల వైపే మేము మొగ్గు చూపుతున్నాం.. ఖచ్చితంగా టైమ్ వచ్చినప్పుడు వైభవ్‌కు అవకాశం దక్కుతుంది.. కానీ ప్రస్తుతానికైతే ఇద్దరు జెన్యూన్ సీమర్స్, ఒక ఆల్‌రౌండర్, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని అయ్యర్ వెల్లడించారు. 

►ALSO READ | 60 వేల కామెంట్లు, 100 మంది మహిళా క్రికెటర్లకు ఐసీసీ అండ.. ట్రోలర్ల ఆట కట్టించేందుకు మాస్టర్ ప్లాన్.. 

ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ ప్లాన్స్: 
పాల్ స్టిర్లింగ్ నుంచి ఐర్లాండ్ టీ20 కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న వికెట్ కీపర్ బ్యాటర్ లోర్కాన్ టక్కర్ మాట్లాడుతూ.. ఒకవేళ తాము టాస్ గెలిచినా మొదట ఫీల్డింగే తీసుకునేవాళ్లమని అన్నాడు. కానీ ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోందని, బోర్డుపై భారీ స్కోరు పెడతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా ఐర్లాండ్ జట్టులో ఫాస్ట్ బౌలర్  జై మూంద్రా (Jai Moondra), హార్డ్ హిట్టర్ మాథ్యూ హాలార్డ్ (Matthew Hollard) ఇద్దరు యంగ్ ప్లేయర్లు డెబ్యూ చేస్తున్నారు.