తెలుగు సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు

తెలుగు సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు

తెలుగు సినీ పరిశ్రమపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్త ఖ్యాతి గడించిందని అన్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ అనంతరం ప్రసంగించిన ప్రధాని సిల్వర్ స్క్రీన్పై టాలీవుడ్ సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయని అన్నారు. స్కిల్వర్ స్క్రీన్ నుంచి ఓటీటీ వరకు తెలుగు సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరగుతోందని చెప్పారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణమని అన్నారు. పోచంపల్లి వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించాయని మోడీ ప్రశంసించారు.