హైదరాబాద్ సిటీ నడిబొడ్డున మరో ఫ్లై ఓవర్.. ఎక్కడి నుంచి ఎలా నిర్మిస్తారంటే..

హైదరాబాద్ సిటీ నడిబొడ్డున మరో ఫ్లై ఓవర్.. ఎక్కడి నుంచి ఎలా నిర్మిస్తారంటే..
  • జీవీకే నుంచి పీవీఎన్ఆర్​ఎక్స్ ప్రెస్​వేను కలిపేలా నిర్మాణం
  • మాసాబ్​ట్యాంక్​ సర్కిల్​లో అండర్​పాస్​
  • 3 కిలోమీటర్లలో 5 చోట్ల టువే అప్​ అండ్​ డౌన్ ర్యాంపులు  
  • కన్సల్టెన్సీకి డీపీఆర్​బాధ్యతలు

హైదరాబాద్ ​సిటీ, వెలుగు: హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ సమస్య నివారణకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు హెచ్ఎండీఏ ప్లాన్ ​రూపొందించింది. దీనివల్ల సిటీ సెంటర్​ నుంచి ఎయిర్ పోర్టుకు వెళ్లే వారితో పాటు మాసబ్​ట్యాంక్, మెహిదీపట్నం వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ​తిప్పలు తప్పనున్నాయి.

బంజారాహిల్స్​జీవీకే –1 మాల్​ నుంచి మొదలయ్యే ఈ ఫ్లై ఓవర్..​తాజ్ కృష్ణ, కేర్ హాస్పిటల్, పెన్షన్ ఆఫీసు మీదుగా మాసాబ్ ట్యాంక్, ఎన్ఎండీసీ మీదుగా పీవీఎన్ఆర్​ఎక్స్​ప్రెస్​ వేను కలుపుతుంది. మొత్తం 3 కిలోమీటర్ల పొడవున నిర్మించే ఈ ఫ్లై ఓవర్​నిర్మాణానికి సాధ్యాసాధ్యాలతో పాటు, డీపీఆర్​సిద్ధం చేసేందుకు ఒక ప్రైవేట్​ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తే రెండేండ్లలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి హెచ్ఎండీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఎక్కడి నుంచి ఎలా నిర్మిస్తారంటే..
పంజాగుట్ట, జీవీకే మాల్, కేర్​ హాస్పిల్, పెన్షన్​ఆఫీసు మీదుగా మెహదీపట్నం వద్ద పీవీ ఎక్స్​ప్రెస్​వేపై వెళ్లే వారికి నిత్యం ట్రాఫిక్​నరకం తప్పడం లేదు. ఇటు లక్డీకాపూల్, ఖైరతాబాద్​ వైపు నుంచి వచ్చే వాహనదారులకు సైతం మాసాబ్​ట్యాంక్​ వద్ద, అటు ఎన్ఎండీసీ వద్ద ట్రాఫిక్​ సమస్య ఎదురవుతోంది. దీంతో హెచ్ఎండీఏ ఆఫీసర్లు బంజారాహిల్స్​జీవీకే మాల్​నుంచి కేర్​హాస్పిటల్, పెన్షన్​హాస్పిటల్, మాసాబ్​ట్యాంక్​, సరోజిని దేవీ హాస్పిటల్​వరకూ ఫోర్​వే ఫ్లై ఓవర్​నిర్మించి పీవీఎన్ఆర్​ఎక్స్​ప్రెస్​వేకు కనెక్ట్​చేస్తారు.

అలాగే, కింద సర్వీస్​రోడ్లపై వెళ్లే వారు కూడా మెహదీపట్నం వరకూ ఫ్లై ఓవర్​ను ఉపయోగించుకునేలా మూడు అప్​ర్యాంపులు, జీవీకే దగ్గర ఎక్కేవారు దిగడానికి రెండు డౌన్​ర్యాంపులను నిర్మించనున్నారు. తాజ్​దక్కన్​వైపు, మాసాబ్​ట్యాంక్​, ఎన్​ఎండీసీ దగ్గర మూడు అప్​ర్యాంపులు,..ఆసిఫ్​నగర్​రోడ్​, బంజారాహిల్స్​రోడ్​నంబర్​2 వద్ద దిగడానికి డౌన్​ ర్యాంపులను కట్టనున్నారు.  

మాసబ్​ ట్యాంక్​ దగ్గర అండర్​ పాస్​
మాసాబ్​ట్యాంక్​ దగ్గర ఇప్పటికే ఫ్లై ఓవర్​ ఉండడంతో దాని పై నుంచి ఈ ఫ్లై ఓవర్​ కట్టాలని అనుకుంటున్నారు. అలాగే, బంజారాహిల్స్​ నుంచి వచ్చే వాళ్లు విజయ్​నగర్​ కాలనీ వైపు వెళ్లేందుకు అండర్​పాస్ ​నిర్మించనున్నారు.   

పీవీఎన్ఆర్తో తగ్గిన సగం కష్టాలు
శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​కు వెళ్లే వారికి ఎలాంటి ట్రాఫిక్​ ఇబ్బంది ఉండకూడదని ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్​ రాజశేఖర్​రెడ్డి హయాంలో పీవీఎన్​ఆర్​పీవీ ఎక్స్​ప్రెస్​వే నిర్మించారు. సరోజినీదేవి హాస్పిటల్​నుంచి మెహదీపట్నం మీదుగా ఆరామ్​ఘర్​ వరకు 11 కి.మీ. మేర నిర్మించిన ఈ ఫ్లై ఓవర్తో సగం ట్రాఫిక్​కష్టాలు తప్పాయి. ఇప్పుడీ కొత్త ఫ్లై ఓవర్​నిర్మాణం పూర్తయితే నగరం నడిబొడ్డు నుంచి వచ్చే వాహనాలు ఈజీగా ఎయిర్​పోర్ట్కు చేరుకోవచ్చు.