
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంలోకి వచ్చాక తామంతా ఓట్ల బిచ్చగాళ్ళమని.. ఏదైనా తప్పు మాట్లాడితే అయిదారు వందల ఓట్లు పోతాయన్న భయం ఉంటుందని తెలిపారు సంజయ్ కుమార్. ఒక్కో ఓటు ఎలా తెచ్చుకోవాలని చూస్తామన్నారాయన. ఓట్లను పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు కదా అని సంజయ్ కుమార్ చెప్పారు.
మంచి మాట్లాడితే ఓట్లు వేస్తారన్నారు సంజయ్ కుమార్. ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ కాలేజీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారాయి.